అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైగింక వేధింపులు,,అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనేందుకు డజన్ల కొద్ది ఉదాహరణలు..గురువారం ఓ కారు డ్రైవర్ (DCW) ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు..విషయంలో వెళ్తే…ఢిల్లీలోని ఎయిమ్స్ గేట్ 2 దగ్గర వేకువ జామున 3 గంటల సమయంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించాడు..ఫుట్ పాత్ పై స్వాతి మలివాల్ తన టీమ్ తో కలిసి నిలబడ్డారు..ఇంతలో అక్కడికి కారులో వచ్చిన హరీశ్ చంద్ర, తన కారులో కూర్చోవాలని స్వాతి మలివాల్ ను పదే పదే పిలిచాడు..అతని ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్వాతి కారు వద్దకు వెళ్లి డోర్ పై చెయ్యి వేసి ప్రశ్నంచబోయింది.. అతను వెంటనే ఆమె చెయ్యిపైనే విండో గ్లాస్ ను క్లోజ్ చేసి ఆమెను 10 నుంచి 15 మీటర్ల దూరం కారుతో అలానే లాక్కుని వెళ్లి అ తరువాత వదిలేశాడు..కారు నంబర్ గుర్తు వుంచుకున్న స్వాతి మలివాల్, పోలీసులకు ఫిర్యాదు చేశారు..తక్షణమే స్పందించిన పోలీసులు కారు నెంబరు ఆధారంగా అతడిని 47 ఏళ్ల హరీశ్ చంద్ర గుర్తించి,,అతన్ని అరెస్ట్ చేసి 323, 341, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..సంఘటన జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
(డిసెంబర్ 31వ తేది రాత్రి స్కూటర్ పై వెళ్తున్న అంజలీ సింగ్ అనే మహిళను కొందరు యువకులు,కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల దూరం ఆమెను కారుతో ఈడ్చుకెళ్లారు..ఈ ఘటనలో అంజలీ మరణించింది..దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన మరువకముందే ఏకంగా మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కు నేడు ఇలాంటి పరిస్థితే ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది..)
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.