AMARAVATHI

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తాం-కమిషనర్ వికాస్

నెల్లూరు: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ హెచ్చరించారు. స్థానిక  పొదలకూరు రోడ్, క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని 34/1,34/2 సచివాలయాల్లో శానిటేషన్ మస్టర్ పాయింట్లను కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సచివాలయంలో ఇన్స్పెక్షన్ రిజిస్టర్ తో పాటు స్పందన రిజిస్టర్ ను సరిగా మైంటైన్ చేయాలని సూచించారు. వసూలు చేసిన పన్నులను సకాలంలో డిపాజిట్ చేయాలని, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సచివాలయ ప్రాంగణంలో ప్రదర్శించాలని కమిషనర్ ఆదేశించారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును పరిశీలించి కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేసారు. స్థానిక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి మంచినీరు సరఫరా అగు జంక్షన్ సమీపంలో రోడ్డు గుంతలమయంగా ఉన్నట్లు గమనించిన కమిషనర్ వెంటనే మరమ్మతులు చేపట్టి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమిస్తూ ఉన్న భవన నిర్మాణ సామగ్రిని తొలగించేందుకు భవన యజమానులకు నోటీసులు జారి చేయాలని సూచించారు. అదేవిధంగా సచివాలయం పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారి చేయాలని కమిషనర్ ఆదేశించారు. యజమానులు వారి ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకుని దోమల నిర్మూలనకు, ప్రహరీ గోడలు నిర్మించుకుని ఆక్రమణలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని అవగాహన కల్పిస్తూ సచివాలయాల పరిధిలోని ప్రతీ ఇంటికి నోటీసులు అందించాలని సానిటరీ సిబ్బంది మరియు కార్యదర్శులను  కమిషనర్ ఆదేశించారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

4 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

4 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.