అమరావతి: మాల్దీవుల దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.మాలేలోని ఓ బిల్డింగ్ లో 10 మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటున్నారు. ఉదయం ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యారేజీలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే పై అంతస్థులకు వ్యాపించడంతో భవనం పై అంతస్థులో ఉన్న 10 మంది బయటకు రాలేకపోయారు. పొగ, మంట కారణంగా ప్రాణాలు వదిలారు. మృతుల్లో 9 మంది భారతీయులు ఉండగా, ఒకరు బంగ్లాదేశీ ఉన్నారు. మంటల్ని అదుపు చేసేందుకు 4 గంటల సమయం పట్టినట్లు ఫైర్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాద ఘటన మాల్దీవుల్లో విదేశీ కార్మికుల దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాలేలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ఇండియన్ హై కమిషన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి మాల్దీవ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.