x
Close
INTERNATIONAL

మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం-9 మంది భారతీయులు మృతి

మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం-9 మంది భారతీయులు మృతి
  • PublishedNovember 10, 2022

అమరావతి: మాల్దీవుల దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.మాలేలోని ఓ బిల్డింగ్ లో 10 మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటున్నారు. ఉదయం ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్యారేజీలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే పై అంతస్థులకు వ్యాపించడంతో భవనం పై అంతస్థులో ఉన్న 10 మంది బయటకు రాలేకపోయారు. పొగ, మంట కారణంగా ప్రాణాలు వదిలారు. మృతుల్లో 9 మంది భారతీయులు ఉండగా, ఒకరు బంగ్లాదేశీ ఉన్నారు. మంటల్ని అదుపు చేసేందుకు 4 గంటల సమయం పట్టినట్లు ఫైర్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాద ఘటన మాల్దీవుల్లో విదేశీ కార్మికుల దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాలేలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ఇండియన్ హై కమిషన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి మాల్దీవ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.