DISTRICTS

నవంబర్ నుంచి నగరంలో ఫ్లెక్సీల నిషేధం-కమిషనర్ హరిత

చదరపు అడుగుకు రూ.100 జరిమానాలు..

నెల్లూరు: పర్యావరణ రక్షణ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీల తయారీ, వినియోగం పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్లు కమిషనర్ శ్రీమతి హరిత వెల్లడించారు. నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీ, సైన్ బోర్డ్ తయారీదారులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాలను వారికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవో నెంబరు 65 ద్వారా పర్యావరణం, అడవులు, సైన్స్ & టెక్నాలజీ విభాగం వారు తే22-09-22ది, ఏ.పి గజిట్ నెం1320రు, రాష్ట్ర పర్యావరణ చట్టం 1986 ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ 1 వ తేదీ నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేదించారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ వ్యక్తీ ప్లాస్టిక్ ఫ్లెక్సీ మెటీరియల్ తయారీ, దిగుమతి, బ్యానర్ ల ముద్రణ, వినియోగం, రవాణా, ప్రదర్శనలపై పూర్తి నిషేధం అమలులోకి వస్తుందని వివరించారు. కార్పొరేషన్ పరిధిలోని ఆరోగ్య అధికారులు, నగర పాలక సంస్థ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటరీ కార్యదర్శులతో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి, చట్టాన్ని అతిక్రమించిన వారిపై పర్యావరణ రక్షణ చట్టం 1986 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. దానితో పాటు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లు నగరంలో వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ప్రదర్శిస్తే నిర్వాహకులకు చదరపు అడుగుకు వంద రూపాయల వంతున జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసారు. నగరంలో ఇప్పటికే ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, వ్యాపార ప్రచారం నిమిత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల మనుగడకై చేస్తున్న అత్యున్నత కార్యక్రమాన్ని ప్రజలంతా బాధ్యతగా భావించి సహకరించాలని కమిషనర్ కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

19 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

23 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

23 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

23 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.