నెల్లూరు: ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఉండాలని జిల్లా కలెక్టరు చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.మంగళవారం వెంకటాచలం మండలం, కసుమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరు ముద్ద (మధ్యాహ్న భోజన పథకం) పథకం అమలును కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు వండిన వెజిటబుల్ రైస్-కుర్మా రుచి చూశారు. ఈ సంధర్భంగా కలెక్టర్, విద్యార్ధులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. విధ్యార్ధులతో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, రుచిగా ఉంటుందా, మెనూ ప్రకారం ఏ రోజు ఏ భోజనం పెడ్తున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తృన్నారా లేదా అని కలెక్టరు, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కలెక్టర్, చిన్నారుల భవిష్యత్తుకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు భోజనం చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కొ ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, తహశీల్దార్ నాగరాజు, ఏం.పి.డి.ఓ శ్రీమతి సుస్మిత, పాఠశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ శ్రీధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.