నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఈనెల 31 వ తేదీ లోపు అన్ని రకాల పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో మంగళవారం ఉదయం నిర్వహించారు. సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను, కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేసి ఉన్నత ఫలితాలను సాధించాలని సూచించారు.ఇప్పటివరకు పన్నులు జారీ చేయని వారిని గుర్తించి వెంటనే సంబంధిత పన్ను నోటీసులను జారీ చేసి వసూళ్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. వివిధ విభాగాలలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను నిర్దిష్ట కాలంలో లోపు పరిష్కరించాలని, గడువు దాటితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం అడ్మిన్ కార్యదర్శుల పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్లంతా పర్యవేక్షించాలని, సచివాలయం విధి నిర్వహణ సమయంలో ప్రతి ఒక్క కార్యదర్శి కార్యాలయంలోనే ఉండేలా తనిఖీలు నిర్వహించాలని రెవెన్యూ అధికారులను సూచించారు.సచివాలయ కార్యదర్శులు అంతా క్రమం తప్పకుండా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ను ధరించేలా స్పెషల్ ఆఫీసర్లు సచివాలయాలను తరచుగా తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
This website uses cookies.