NATIONAL

డిశంబరు వరకు ఫ్రీ రేషన్ బియ్యం-ఉద్యొగులకు 4 శాతం డిఏ పెంపు

అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద కేంద్రం అందస్తున్న ఫ్రీ రేషన్ బయ్యంను మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదితో ఫ్రీ రేషన్ గడువు ముగియనున్న నేపధ్యంలో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.కొవిడ్-19 కారణంగా లాక్ డౌన్ 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సంవత్సరం మార్చిలో పథకం గడువు ముగియాల్సి ఉంది.అయితే పేద,బడుగు వర్గాల అర్ధిక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని, సెప్టెంబర్ 30 వరకు పొడగించారు. తాజాగా మరో 3 నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా 80 కోట్లకుపైగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు.

4 శాతం DA పెంపు:- పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు అందించింది. ఉద్యోగులకు చెల్లించే DA 4 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల 38 శాతానికి చేరునుంది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు కేంద్రం 3 శాతం DA పెంచింది.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

16 mins ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

51 mins ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

1 hour ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

21 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

1 day ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

1 day ago

This website uses cookies.