POLITICS

కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన గులాం నబీ ఆజాద్

అమరావతి: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకుడు గులాం నబీ ఆజాద్,జమ్మూలో తాను స్థాపించబోయే కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన వివరాలను వెల్లడిస్తూ,నూతన పార్టీ పేరుకోసం దాదాపు 1500 పేర్లను ఉర్దూ, సంస్కృతంలో పరిశీలన చేసినట్లు తెలిపారు. చివరికి ఉర్దూ, హిందీ కలిపి ‘హిందుస్థానీ’ అన్నారు. ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వాతంత్ర్యాన్ని ప్రతిబింబించేలా పార్టీ పేరు ఉండాలని కోరుకున్నామని, అందుకే ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో మూడు రంగులతో జెండాను రూపొందించారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తన పార్టీ జమ్మకశ్మీర్ కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని చెప్పారు.తాను స్థాపించిన కొత్త పార్టీలో ‘ఏజ్ బార్’ ఉండదని, యువకులు, అనుభవజ్ఞులు పార్టీలో కలిసి పనిచేస్తారని తెలిపాడు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

8 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

8 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.