DISTRICTS

కస్తూర్బా బాలికల విద్యాలయం ఆవరణంలో చేనేత ఎగ్జిబిషన్-కలెక్టర్

నేతన్నలను ప్రోత్సహించాలి..

నెల్లూరు: నగరంలోని కస్తూరిదేవి బాలికల విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను జిల్లా ప్రజలందరూ సందర్శించి, విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కళాకారుల వృత్తి, నైపుణ్యాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ చక్రధర్ బాబు కోరారు..ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని  కస్తూర్బా బాలికల విద్యాలయం (రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్)లో నాబార్డు సహకారంతో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయ దుకాణాలను కలెక్టర్ ప్రారంభించారు..ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 30 చేనేత వస్త్రాల విక్రయ స్టాళ్లతో కస్తూరి దేవి బాలికల విద్యాలయంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల నుంచి పేరెన్నికగల కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారన్నారు. ప్రాచీన కళలు మరుగున పడిపోకుండా, చేనేత కార్మికులకు అండగా, వారి శ్రమకు గుర్తింపు, గౌరవం ఇస్తూ ఈ ప్రదర్శనలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలను ప్రజలందరూ కొనుగోలు చేయాలని కోరారు.సుమారు 300 గంటలపాటు మగ్గం మీద కార్మికుడు శ్రమిస్తే ఒక చీర తయారవుతుందని, అదే పవర్ హ్యాండ్లూమ్స్ మిషన్ల ద్వారా మూడు నిమిషాల్లో తయారయ్యే చీర ఎక్కువ కాలం మన్నిక ఉండదని, అదే మగ్గం మీద నేసిన చీర ఎంతో నాణ్యంగా ఉంటుందని, నేతన్న కష్టానికి ప్రజలంతా తమ సహకారం అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని అధికారులంతా తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించి రావాలన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

3 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

3 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

4 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

1 day ago

This website uses cookies.