నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద అబ్బిపురంలో పంచాయతీకి చెందిన నిధులు దుర్వినియోగం చేశారని ప్రశ్నించినందుకు,ఇమ్మిడిశెట్టి,వెంగయ్య అనే రైతు పొలంలో అధికార పార్టీకి చెందిన మదాందులు 98 మామిడి చెట్లను నరికి వేయడమే కాకుండా, రెండు బోర్లను ధ్వంసం చేయడం జరిగిందని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ అన్నారు..మంగళవారం బాధితులతో కలసి ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడారు..నేడు రాష్ట్రవ్యాప్తంగా విష సంస్కృతి వేళ్ళూనుకుంటుందని,,ప్రశ్నించే గొంతులను నొక్కి వేయాలని చూడడం నాయకులకు ఆలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నాయకులను చూసి,అదే బాటలో మండల స్థాయి నాయకులు ప్రవర్తించడం దారుణంమన్నారు..రైతు తొటపై పడి,,అచ్చోసిన ఆంబోతులా బరితెగించి చెట్లను నరకడమే కాకుండా యదేచ్ఛగా గ్రామంలోనే తిరగడం విస్మయానికి గురిచేస్తుందన్నారు..పోలీస్ ఇప్పటికైనా నిందితుని అరెస్టు చేసి విచారించి,బాధితులకు తగిన న్యాయం చేయాలని, లేని పక్షంలో జనసేన పార్టీ ఈ విషయమై ఉద్యమించవలసి వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామన్నారు..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.