AMARAVATHI

ఏపిలో తిరగాలి అంటే పాస్ పోర్టు తీసుకుని రావాలా ? -పవన్

అమరావతి: ఆంద్రప్రదేశ్ లో తిరగాలి అంటే పాస్ పోర్టు తీసుకుని రావల్సి పరిస్థితులు కన్పిస్తున్నయని,,కేసులకు భయపడే వాడిని అయితే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..వారాహి యాత్రలో రాళ్లు వేసేందుకు కొంత మంది సిద్దమైనట్లు తనకు స్పష్టమైన సమాచారం వుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు అందాయి..ఈ విషయంపై కృష్ణా జిల్లా పెడనలో పెడనలో జరిగిన వారాహి యాత్రలో పవన్ పై విధంగా స్పందించారు..
పోలీసులు ఎక్కడికి రమ్మన్నా వచ్చేందుకు తాను సిద్దంగా వున్నానని,,తాను నోరు తెరిస్తే కేసులు,, నోటీసులు వచ్చేస్తున్నాయని అన్నారు..పాదయాత్రలో యువతకు ఉద్యోగలు ఇస్తానని జగన్ హామీలు ఇచ్చారని,,అయితే ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే యువత జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటుందని ప్రశ్నించారు..తమ సమావేశాలకు యువత భారీగా ఎందుకు వస్తున్నారని నిలదీశారు..పాలించేవ్యక్తి మనకు అండగా లేనప్పుడు అలాంటి వారిని ప్రక్క తొలగించేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని జనసేనాని కోరారు.. రాజకీయాల్లో జగన్ అనే వ్యక్తి అనర్హుడని,, 2024 ఎన్నికల్లో ఆయనను రాజకీయాల్లో లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు..ఇక్కడ ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు నుంచి వెళ్లాలంటే,, జనసైనికులు నమస్కారం పెట్టి వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయంట,,,,అలాంటి వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పిందామన్నారు.. ఎన్నికల సమయంలో టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.ప్రజలు పదేళ్లు తన వెంట ఉంటే హైదరాబాద్ స్థాయిలో ఏపీని అభివృద్ధి చేస్తానని తెలిపారు..టీడీపీతో పాటు ఇంకెవరు ముందుకు వచ్చినా కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు..తనకు బీజేపీ అశీస్సులు ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

16 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

18 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

21 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

22 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.