అమరావతి: తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి మరి, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మంగళశారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్,తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులపై ధ్వజమేత్తారు.ఇంతకాలం సహనంతో వున్నానని,అయితే తన ఇంట్లోని చిన్నపిల్లలను,తల్లిని ఆవమానించిన భరించానని అయితే ఇక నుంచి అలాంటి పరిస్థితి వుండదు,,నేటి నుంచి ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని, సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానని అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వైసీపీ గూండాల్లారా ఒంటి చేత్తో మెడ పిసికేస్తా, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదు, నా వ్యక్తిగత జీవితాని,నా కుటుంబాన్ని కూడా వదల కుండా ఆసభ్యంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ. 5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చాను,మీ లాగా ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో కులకడంలేదన్నారు.రాజకీయ ముఖచిత్రం మారబోతోంది..జనసైనికులు సిద్ధంగా ఉండండంటూ పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో పర్యటించారా ? అంటూ ప్రశ్నించారు.వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కృషి చేస్తా.. కార్మిక సంఘ నేతలు ముందుకు రావాలి.. బీజేపీ, ప్రధాని అంటే గౌరవం ఉంది కానీ వాళ్లకు ఊడిగం చేయను? మంత్రులపై దాడులు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్దకు నా బృందం వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ జనసేన పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలి.. పార్టీ నేతలు సిద్ధమైతే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదామంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.