నెల్లూరు: ప్రపంచంలో మహిళలకు భారత దేశం సురక్షితమైన దేశం అనే విషయాన్నిదేశ వ్యాప్తంగా తన సైకిల్ యాత్ర ద్వారా ప్రపంచానికి నిరూపించే ప్రయత్నం చేస్తూ నెల్లూరు నగరానికి చేరుకున్నఆల్ ఇండియా సైకిల్ టూరిస్ట్ ఆషా మాల్వియను మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబు సన్మానించి, ఆమెను అభినందించారు.. తన తల్లి రాజు బాయి ప్రోత్సాహంతో పీజీ పూర్తి చేసుకొని నేషనల్ ప్లేయర్ మౌంట్ నీరింగ్ గా ఉంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అట్ మౌంట్ నీరింగ్ సాధించడం జరిగిందని, ప్రపంచంలో మహిళలకు భారతదేశం సురక్షితమైన దేశం అనే విషయాన్ని దేశ వ్యాప్తంగా తన సైకిల్ యాత్ర ద్వారా నిరూపించే ప్రయత్నంలో భాగంగా 2022, నవంబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోపాల్ నుంచి తన సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగిందని ఆమె, జిల్లా కలెక్టర్ కు వివరించారు..ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల్లో తన సైకిల్ యాత్రను చేసి 8300 కిలో మీటర్ల మేర ప్రయాణించడం జరిగిందని తెలిపారు.25 వేల కిలో మీటర్ల మేర సైకిల్ యాత్ర చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోవడం జరిగిందని, 2023, ఆగష్టు 15న డిల్లీకి చేరుకోవడంతో నా సైకిల్ యాత్ర పూర్తి అవుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో హరిత టూరిజం హోటల్ డివిజనల్ మేనేజర్ శివా రెడ్డి, సుపర్వైజర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.