నెల్లూరు: రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, అధికారులను ఆదేశించారు. గురువారం కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రామాయపట్నం నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు, మౌలిక వసతులు, భూ సేకరణ ప్రక్రియపై కరికాల వలెవన్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి సమీక్షించారు. రామాయపట్నం పోర్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాలైన మొండివారిపాలెం, రావులవారిపాలెం, కర్లపాలెం, సాలిపేట గ్రామాలకు సంబంధించి చేపట్టాల్సిన ఆర్.ఆర్. ప్యాకేజీ పురోగతి, భూ సేకరణ ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు. రామాయపట్నం పోర్టు కు సంబంధించి మొదటి ఫేజ్ లో చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, అలాగే పోర్టు నిర్వాసితులకు చేపట్టాల్సిన పునరావాస పనులు త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ మీడియాతో మాట్లాడుతూ, రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు అన్ని వసతులతో ఆధునిక పునరావాస గ్రామాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో పాటు పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీని వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ప్రత్యక్షంగా సుమారు 23 వేల మందికి, పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. పోర్టు అనుసంధానం గా చేపడుతున్న పరిశ్రమల్లో స్థానిక ప్రజలకు 75 శాతం మేర వారి యొక్క విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనతో పాటు రైలు, రోడ్డు, ఎయిర్ వే కనెక్టివిటీనీ అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.