నెల్లూరు: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్టులో అనేక అక్రమాలు జరిగాయని,వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం సిపిఐఎం జిల్లా కమిటీసభ్యులతో కలసి ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎన్నికల కమిటీ కన్వీనర్ మోహన్ రావు తెలిపారు.టీచర్ ఎమ్మెల్సీ అధికార పార్టీ అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ విద్యాలయాలలోని ప్రైవేట్ బోధనా సిబ్బందిని అనర్హులైన వారిని ఓటర్లగా నమోదు చేయించడం జరిగిందని, వీటిని వెరిఫై చేయించేందుకు జిల్లా స్థాయి ఐఏఎస్ అధికారిని నియమించి వెరిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో బోగస్ సర్టిఫికెట్లతో నమోదు చేయించారని, ఈ బిఎల్వోలు సక్రమమైన వెరిఫికేషన్ లేకుండానే ఓటర్ లిస్టులో చేర్చారని వీటి పై విచారణ చేపట్టాలని కోరారు. అప్లై చేసిన ప్రతి ఓటరు అప్లికేషన్, ఇతర సర్టిఫికెట్లను వెబ్సైట్లో పెట్టాలని ,అప్పుడే వెరిఫికేషన్ సాధ్యమవుతుందని తెలియజేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 2000 ఓట్ల నుంచి నాలుగు వేల ఓట్లు ఉన్నాయని ,ప్రతి 1000 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మరియు ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనచేపడుతామని తెలియజేశారు .
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.