DISTRICTS

జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం-కలెక్టర్

ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి..

కర్నూలు: జవహర్ నవోదయ విద్యాలయ, బనవాసిలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సోమవారం తెలిపారు.నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ తెలిపారు.ఆన్ లైన్ పోర్టల్  లో దరఖాస్తుల ప్రక్రియ 02.01.2023 నుంచి ప్రారంభమైందన్నారు.. ద్యార్థులు తమ దరఖాస్తులను NVS వెబ్ సైట్ https://cbseitms.rcil.gov.in/nvs  ద్వారా పంపాలని కలెక్టర్ సూచించారు..విద్యార్థులు 3వ, 4వ తరగతి ఉత్తీర్ణత పొంది, ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. విద్యార్థులు 01.05.2011 నుంచి 30. 04.2013 మధ్య జన్మించిన వారై ఉండాలని తెలిపారు..ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు..ఏప్రిల్ నెల 29వ తేదీ ఎంపిక పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://cbseitms.rcil.gov.in/nvs ను సందర్శించవచ్చని, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

22 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

23 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

23 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

24 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 days ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.