అమరావతి: వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది..వీక్షకులకు భయం కలిగించే వీడియోలు,,రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలు,,మృతదేహాలను యథాతధంగా చూపించకుండా,,బాధ్యతాయుతమైన వార్తలు,స్టోరీలను ప్రసారం చేయాలని సూచించింది..నేరాలు,ప్రమాదాలు,హింసకు సంబంధించిన విషయాల్లో టీవీ ఛానళ్లు జాగ్రత్తలు తీసుకుని,, ప్రోగామ్ కోడ్కు అనుగుణంగా ఫుటేజ్లను ప్రసారం చేయాలని ఆదేశించింది..ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఫోటోలను వీడియో క్లిపింగ్ లను టీవీ చానల్స్ ప్రసారం చేశాయి..”కొన్ని ఛానళ్లు మృతదేహాలు,,రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలను దగ్గర నుంచి చూపిస్తున్నాయి..టీచర్లు పిల్లలను కొట్టే వీడియోలు, మహిళలు, చిన్నారులు, పెద్దలపై దాడుల వీడియోలను బ్లర్రింగ్ చేయకుండానే మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నాయి..ఇలా రిపోర్ట్ చేయడం బాధాకరమే కాకుండా,, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధం అని పేర్కొంది..వీక్షకులను కూడా ఇవి కలవరపాటుకు గురిచేస్తాయని,, చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపింది..బాధితుల గోప్యతకు కూడా భంగం కలుగుతుందని,,అలాగే ఇళ్లలో అన్ని వయసుల వారు కలిసి కూర్చుని టీవీ ప్రోగ్రామ్లు చూస్తుంటారని పేర్కొంది..ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన కథనాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రసారాలు చేయాలి” అని మంత్రిత్వ శాఖ ఈ అడ్వయిజరీలో పేర్కొంది.. చాలాకేసుల్లో సోషల్ మీడియోలో నుంచి వీడియోలను తీసుకుని, ఎలాంటి సమీక్ష లేకుండా, సవరణలు చేయకుండా, ప్రోగ్రామ్ కోడ్ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రసారం సాగిస్తున్నారని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.