నెల్లూరు: నగరాన్ని పర్యావరణ హితమైన స్వచ్ఛతతో ఉంచేందుకు ప్రజలంతా సంకల్పించాలని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి, కమిషనర్ హరితలు ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తాధ్వర్యంలో “ఇండియన్ స్వచ్ఛతా లీగ్” ర్యాలీని శనివారం ఉదయం నిర్వహించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బారాషాహీద్ దర్గా ప్రాంగణం, ఘాట్ పరిసర ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ దేశ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన నగరానికి చెందిన పెంచల చైతన్యను మేయర్, కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, అన్ని విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.