AMARAVATHI

యాచకులకు సంక్షేమ పథకాలు అందించే అవకాశాలను పరిశీలించండి- కమిషనర్ వికాస్

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను నగరంలోని యాచకులకు అందించి వారి సంక్షేమానికి కృషి చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా 45వ డివిజను పొగతోట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్ బుధవారం ఉదయం 6.30 గంటలకు పర్యవేక్షించారు.స్థానిక సాయిబాబా మందిరం ప్రాంగణంలో యాచిస్తున్న వారిని గమనించిన కమిషనర్ వారితో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి అందించాల్సిన పెన్షన్, ఉచిత గృహాలు వంటి సదుపాయాల కోసం అవసరమైన ఆధార్, ఓటర్, రేషన్ కార్డు వంటి పత్రాలను మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అనంతరం డివిజను పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. విద్యుత్ శాఖ వారు తొలగిస్తున్న భారీ చెట్ల కొమ్మలను స్థానిక ప్రదేశాల్లోనే వదిలేస్తున్నారని, ఆ శాఖ వారితో మాట్లాడి పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి, సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

7 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

11 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

16 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

This website uses cookies.