నెల్లూరు: నగరంలోని 54 డివిజనుల్లో (లే అవుట్ రెగులేషన్ స్కీం) L.R.S 2020 పధకం, 2022 అక్టోబర్ 31వ తేదితో ముగియనున్నందున, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత సూచించారు.నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం, సచివాలయం వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో L.R.S పై సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ఉన్న వార్డు ప్లానింగ్ కార్యదర్శుల లాగిన్ లో ఉన్న దరఖాస్తుల భూస్థితి, డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం 170 అప్లికేషన్ లను నేటితో పూర్తి చేశామని తెలిపారు.L.R.Sపై లే-అవుట్ యజమానులకు అవగాహన కల్పించి అప్లికేషన్ లను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిసిపి, ఎ.సి.పి, టిపిఓ లు, వార్డు ప్లానింగ్ & రెగులేషన్ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.