నెల్లూరు: ప్రముఖ సినీ నేపధ్య గాయని వాణీ జయరాం చెన్నైలోని ఆమె స్వగృహంలో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు..ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మధురగానంతో ఓలలాడించిన వాణీ జయరాం గొంతు మూగబోయింది..పదేళ్ల వయస్సులోనే మొదటిసారి ఆల్ ఇండియా రేడియాలో పాటలు పాడిన వాణీ జయరాం,, 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిపాటను పాడారు..ఆమె ఆలిపించిన తొలిపాటకే తాన్సేన్తో పాటు మరో నాలుగు అవార్డులను అందుకున్నారు..తెలుగు శ్రోతలను ‘అభిమానవంతుడు’ అనే సినిమాలోని పాటలతో పలకరించింది.. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగళ్ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నది..‘శంకరాభరణం’ చిత్రంలోని మానస సంచరరే పాటకు రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు..‘స్వాతికిరణం’ చిత్రంలోని ‘‘ఆనతినియ్యరా హరా..’’ పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు..ఆమె నేపథ్యగాయనిగా 50 ఏళ్ల సినీ జీవితాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్నారు..ఆమె కెరీర్లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్పురి, ఒరియా భాషలతో పాటు మొత్తంగా 18 భాషల్లో పాటలను పాడారు..దాదాపు వేయి సినిమాల్లో 10 వేల పాటలను పాడారు..ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది..వాణీ జయరాం మరణవార్త గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.