AMARAVATHI

రాముడి విగ్రహాలను తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు

అమరావతి: 2024 జనవరిలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ప్రారంభం కానున్న రామమందిర ప్రాగణంలో ఏర్పాటు చేసేందుకు రాముడి విగ్రహాలను పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం శిల్పులు రూపొందిస్తున్నారు.. మహమ్మద్ జమాలుద్దీన్ అతని కుమారుడు బిట్టులు ఈ అద్భుతమైన విగ్రహాలను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు..జమాలుద్దీన్ గతంలో గణేష్,,దుర్గమాత విగ్రహాలను కూడా తయారు చేశారు..అవి ఎంతగానో ప్రజాదరణ పొందడంతో ఆన్ లైన్ ద్వారా వీరికి అయోధ్య నుంచి రాముడి విగ్రహాల తయారీ ఆర్డర్ అందింది..వీరు విగ్రహాలను పూర్తిగా ఫైబర్ తో తయారు చేస్తారు..ఒక్కొ విగ్రహాం ధర దాదాపు రూ.2.8 లక్షలు అవుతుంది..ఇక మతం అనేది వ్యక్తిగత విషయం అని,,భిన్నమతస్తులు నివాసిస్తున్న భారతదేశంలో అందరం కలిసి జీవించాలన్నారు..రాముడి విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని,,కళకు మతం లేదనేది ఒక కళాకారుడిగా నా సందేశం అని జమాలుద్దీన్ పేర్కొన్నారు..ఈ విగ్రహాలు తయారు చేసేందుకు దాదాపు ఒకటిన్నర నెల పడుతుందని,,వీటిని అయోధ్యకు తరలించేందుకు 45 రోజుల సమయం పడుతుందని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

3 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

6 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

6 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

8 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.