AMARAVATHIDEVOTIONAL

రాముడి విగ్రహాలను తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు

అమరావతి: 2024 జనవరిలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ప్రారంభం కానున్న రామమందిర ప్రాగణంలో ఏర్పాటు చేసేందుకు రాముడి విగ్రహాలను పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం శిల్పులు రూపొందిస్తున్నారు.. మహమ్మద్ జమాలుద్దీన్ అతని కుమారుడు బిట్టులు ఈ అద్భుతమైన విగ్రహాలను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు..జమాలుద్దీన్ గతంలో గణేష్,,దుర్గమాత విగ్రహాలను కూడా తయారు చేశారు..అవి ఎంతగానో ప్రజాదరణ పొందడంతో ఆన్ లైన్ ద్వారా వీరికి అయోధ్య నుంచి రాముడి విగ్రహాల తయారీ ఆర్డర్ అందింది..వీరు విగ్రహాలను పూర్తిగా ఫైబర్ తో తయారు చేస్తారు..ఒక్కొ విగ్రహాం ధర దాదాపు రూ.2.8 లక్షలు అవుతుంది..ఇక మతం అనేది వ్యక్తిగత విషయం అని,,భిన్నమతస్తులు నివాసిస్తున్న భారతదేశంలో అందరం కలిసి జీవించాలన్నారు..రాముడి విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని,,కళకు మతం లేదనేది ఒక కళాకారుడిగా నా సందేశం అని జమాలుద్దీన్ పేర్కొన్నారు..ఈ విగ్రహాలు తయారు చేసేందుకు దాదాపు ఒకటిన్నర నెల పడుతుందని,,వీటిని అయోధ్యకు తరలించేందుకు 45 రోజుల సమయం పడుతుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *