NATIONAL

భవిష్యత్ తరాల కోసం నూతన విద్యా విధానం-ప్రధాని మోదీ

అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.. శనివారం రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ వర్చువల్ విధానంలో పాల్గొన్ని మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానంలో భావి కాల లక్షణాలున్న,,దూరదృష్టిగల విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు..2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs), వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు..IIT, IIIT, IIM, AIIMS వంటి విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందన్నారు..2014 తరువాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందన్నారు..భారత దేశ భవిష్యత్తు కాంతులీనాలంటే మన ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు గొప్ప పాత్ర పోషించవలసి ఉంటుందన్నారు..స్వాతంత్ర్యం లభించిన అమృత కాలంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలను,, విద్యా విధానాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు..ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు,, శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్‌కు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా శాఖలు ఉన్నాయి..25,000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాల,,అండర్‌గ్రాడ్యుయేట్,,పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అందించేందుకు సదుపాయాలు ఉన్నాయి.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

10 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

11 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

15 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

16 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

17 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.