NATIONAL

ఒకే దేశం-ఒకే పోలీస్ యూనిఫాం-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే దేశం-ఒకే పోలీస్ యూనిఫాం’ అని కొత్త ప్రతిపాదన చేశారు. శుక్రవారం హర్యానాలోని సూరజ్కుండులో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు,కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరైన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్రాల బాధ్యతే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యతో సంబంధం ఉందని అన్నారు. పోలీస్ వ్యవస్థ బాధ్యత పూర్తిగా రాష్ట్రాల పరివేక్ష్యణలో ఉండడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల మేరకు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన పోలీస్ యూనిఫాం ఉంటుందన్నారు. అయితే ఇలా భిన్నంగా కాకుండా, దేశం మొత్తం పోలీసు వ్యవస్థకు ఒకే యూనిఫాం ఉండేలా చూస్తూ బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు.అలాగే రాష్ట్రాలు శాంతి భధ్రతల పరివేక్షణ,నేరా పరిశోధన గురించి ఒక రాష్ట్రం నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు.నేటి పరిస్థితుల్లో నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి చేయవచ్చని అన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

9 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

10 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.