AMARAVATHI

న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయి-సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

అమరావతి: న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసులు ప్రధాన సమస్యగా ఉన్నాయని,,పెండింగ్ లో ఉన్న కేసులను త్వరిగతగతిన పూర్తి చేయకపోతే,,న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని,,ఈలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు..శనివారం విజయవాడలోని కోర్టుల భవన సముదాయన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు..అనంతరం అయన ప్రసంగిస్తూ  న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలను నా శక్తి మేరకు పూరించానని వెల్లడించారు..సమాజంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైనదని,,ప్రజలకు న్యాయం అందించటంలో వారు మరింత కృషి చేయాలని సూచించారు..కేసుల వాదనలు విషయాల్లోను తీసుకోవాల్సిన పలు కీలక పాయింట్ల విషయాల్లో సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు సూచనలు ఇస్తూ వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు..విశాఖలో కూడా కొన్ని భవనాలు పూర్తి చేయాల్సి ఉందని,,వేదికపై ఉన్న సీఎం జగన్ కు గుర్తు చేశారు..విజయవాడ నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో సుమారు వంద కోట్ల రూపాయ‌ల వ్యయంతో తొమ్మిది అంత‌స్తుల భ‌వనాన్ని నిర్మించారు.. 2013 మే 13నే ఈ భవన సముదాయానికి శంకుస్థాపన జరిగినా కోర్టు కాంప్లెక్స్‌  నిర్మాణం పూర్తి కావ‌టానికి 9 సంవ‌త్సరాలు ప‌ట్టింది..కరోనా కారణంగా రెండున్నర సంవ‌త్సరాల‌కుపైగా నిర్మాణం నిలిచిపోయింది.. ఈ విషయంపై పలువురు న్యాయ‌వాదులు హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేయడంతో,, న్యాయ‌స్దానం ఆదేశాలతో ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది..ఎట్టకేల‌కు 3.70 ఎక‌రాల్లో తొమ్మిది అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తైంది..జిల్లాలోని 31 కోర్టుల‌ు ఒకే చోటకు ఉండడం వలన బాధితులకు ప్రయాస తప్పతుందని న్యాయ‌వాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఈ ప్రాంతంకు చెందిన వారు కావడం,వారి చేతుల మీదుగా కోర్టు భవనాల నిర్మాణకు పునాదులు వేసి నేడు అదే కోర్టు భవనాలు ప్రారంభించడం గుర్తు వుంచుకోతగ్గరోజున్నారు.

 

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

18 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

19 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

21 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

21 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

22 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.