భారీగా నిరసన ర్యాలీ..
నెల్లూరు: ఏపీ జెన్కో వద్ద 180 రోజులుగా జరుగుతున్న నిరసనలో భాగంగా సోమవారం ఏపీ జెన్కో గేటు వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు కార్మికులు సిద్దకావడంతో భారీగా పోలీసులు మోహరించి రిలే నిరాహార దీక్షలు అడ్డుకున్నారు..అందుకు నిరసనగా ఏపీ జెన్కో జేఏసీ మరియు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు నల్ల బ్యానర్ చేపట్టి, మూతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏపీ జెన్కో మేనేజ్మెంట్,, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు..పరిరక్షణ కమిటీ కన్వీనర్ మోహన్ రావు మాట్లాడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు పూనుకుంటే, దీక్షలను అడ్డుకోవడం సిగ్గుచేటని, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించడమేనని విమర్శించారు. పోలీసు నిర్బంధము ద్వారా ఉద్యమాన్ని అణిచివేయలేరని, ఏపీ జెన్కో పోరాటాన్ని వివిధ దశలలో ఉదృతం చేస్తామని తెలియజేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి, కలెక్టరేట్ వద్ద దీక్షలు,మహా పాదయాత్ర నిర్వహించి తీరుతామని,ఏపీ జెన్కో ముట్టడికి సైతం వెనకాడేది లేదని తెలియజేశారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.