నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కారానికై రూపొందించిన స్పందన వేదికను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జాహ్నవి సూచించారు..సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన వేదికను కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నామని వివరించారు..అదేవిధంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంభందించి 23 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీ నివేశన స్థలాలు, టిడ్కో గృహాల మంజూరు వివరాలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నామని కమిషనర్ చెప్పారు..అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన వారి జాబితాలను కార్యాలయంతో పాటు సచివాలయాల్లో సైతం అందుబాటులోకి తెచ్చామని, పథకాలకు సంభందించిన వివరాలకై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.