అమరావతి: ప్రపంపచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్న G20 దేశాల కూటమికి నేటి నుంచి భారతదేశం నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా ఇందుకు సంబంధించిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. G20 సారధ్య బాధ్యతల బదలాయింపునకు సూచికగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో వుడెన్ హెమర్ (కర్ర సుత్తె)ను మోడీ చేతికి అందించి అభినందనలు తెలిపారు. G20 సారధ్య బాధ్యతలు భారత్ అందుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన ఆంశం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతకుముందు G20 సదస్సులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాన చర్చ జరిగింది.ఐరోపా దేశం పోలాండ్ లో జరిగిన మిస్సైల్ దాడిలో ఇద్దరు మృతిచెందిన సంఘటనపైనా చర్చ జరిగింది. మిస్సైల్ దాడి చేసింది రష్యానే అని,,ఆ మిస్సైల్ రష్యాలో తయారైందేనని పోలాండ్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కేంద్రంగా ఈ చర్చ సాగింది. మరోవైపు G20 వేదికగా వివిధ దేశాల అధినేతలతోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మోడీ కలిసిన దేశాధినేతల జాబితాలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కూడా ఉన్నారు. గల్వాన్ లోయ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ ఘటన తర్వాత భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. G20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరయ్యారు.
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
This website uses cookies.