నెల్లూరు: రాష్ట్రంలో జులై 5వ తేదీ పాఠశాలలు ప్రారంభించి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పాఠశాలకు అందించకపోవడాన్ని ప్రభుత్వం వైఫల్యంగా ఏబీవీపీ భావిస్తుందని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నలిశెట్టి రాజశేఖర్ చెప్పారు..బుధవారం నగరంలోని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు దందా అరికట్టాలని,,కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల వివరాలను తెలిపే విధంగా నోటీసు బోర్డ్ ఏర్పాటు చేసేలా DEO,MEO లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాఠశాల విలీనం చేసే జీవో నెంబర్ 117 ను ఏబీవీపీ ఖండిస్తోందని,,సదరు జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. హై స్కూల్ కేంద్రంగా ఒక కిలోమీటర్ లోపల ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూలోని 3,4,5 తరగతులు హైస్కూల్లో కలపడాన్ని ఏబీవీపీ ఖండిస్తుందన్నారు..1 తరగతి నుండి 8వ తరగతి వరకు తెలుగు మాధ్యంలోనే బోధన ఉండాలని,,ఏ మీడియాలో చదువుకోవాలి అనే అవకాశం విద్యార్థులకు వదిలేయాలి అని కోరారు..ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి,సహాయ కార్యదర్శి చందు, శ్రీను ,సాయి ,మూర్తి ,అరుణాచలం, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.