నెల్లూరు: జిల్లాలో రెడ్ క్రాస్ సేవా సంస్థ వివిధ రకాల వైద్య సేవలు అందిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.ఆదివారం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయంలో మొబైల్ వ్యాక్సినేషన్, మొబైల్ రక్తదాన వాహనాలను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సేవా సంస్థ అనేక రకాల వైద్య సేవలు అందిస్తు దేశంలోనే గుర్తింపు తెచ్చుకోవటం జిల్లాకే గర్వకారణమన్నారు.ఒక కోటి 12 లక్షల ఖరీదు చేసే అధునాతన వసతులతో కూడిన మొబైల్ వాహనాలు నెల్లూరు జిల్లాకు కేటాయించడం వారి పనితనానికి నిదర్శనమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రక్తపు నిల్వలు కొరవడిన సందర్భాలలో రక్తదాతల చెంతకే వాహనంను తీసుకెళ్లి రక్తం సేకరించే సౌకర్యం కలిగిందన్నారు.అదేవిధంగా వివిధ రకాల వ్యాక్సినేషన్ లను ప్రజలకు అందించటానికి వారి చెంతకే వాహనం వెళుతుందన్నారు. కష్టపడి పనిచేసి సమర్థవంతంగా సేవలు అందించడం వల్లనే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన వాహనాలు జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు కేంద్రం కేటాయించటం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.రెడ్ క్రాస్ సంస్థ వారిచే ఉచిత కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు మంత్రి కాకాణి అందించారు. వారితో ముచ్చటిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దని, ధైర్యంగా జీవించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.