Categories: DISTRICTS

అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయండి- కమిషనర్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలో ఓటర్లు-జనాభా నిష్పత్తిలో 50 వేల ఓటర్ల తేడా ఉందని, స్పెషల్ కాంపెయిన్ ప్రోగ్రాం ద్వారా దానిని త్వరితగతిన సరి చేయనున్నామని తెలిపారు. జనాభాకు తగ్గట్టుగా ఓటర్లు నమోదుకై ప్రజలను చైతన్యపరిచి 18 సంవత్సరాలు దాటిన అర్హులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు కృషి చేయాలని సచివాలయ కార్యదర్శులను కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలో పెండింగులో ఉన్న 6,7, 8  క్లైయిమ్ ఫారాలను నిర్ణీత గడువులోగా సచివాలయ కార్యదర్శులు పరిష్కరించాలని, బూత్ స్థాయి అధికారుల సేవలను అన్ని విధాల వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఓటర్ల జాబితా 2024 సంవత్సరం డిసెంబర్ వరకు ప్రధాన ఓటర్ల జాబితాగా ఉంటుందని, పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. జనాభాకు తగ్గట్టుగా ఓటర్లను నమోదు చేసేందుకు ఇంటింటి సర్వే డేటా వివరాలు ఆధారంగా క్లెయిమ్ 6 ఫారం లను పెద్ద ఎత్తున సేకరించాలని సచివాలయ సెక్రటరీలను ఆదేశించారు. ప్రతిఒక్క బి.ఎల్.ఓ 200 మంది నూతన ఓటర్లను తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

42 mins ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

3 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

3 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

4 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

23 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 day ago

This website uses cookies.