అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబరు 1వ తేది నుంచి G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ప్రపంచ దేశాల్లో అనేక రాజకీయ సవాళ్లు ఉన్న సమయలో భారత్ G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ అన్నారు.గురువారం ఢిల్లీలో జరిగిన G-20 యూనివర్సిటీ కనెక్ట్..ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ ఈవెంట్ లో కన్పరేన్స్ లో అయన మాట్లాడారు. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తొందని, ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి G-20 ఉపయోగపడుతుందన్నారు.సంవత్సరం పాటు భారత్ G-20 అధ్యక్ష పదవిలో కొనసాగుతుంది. సంవత్సరం వ్యవధిలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో పలు అంశాలపై 200 సమావేశాలను నిర్వహించనున్నారు.అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో G-20 లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.