HYDERABAD

సీనియర్ నటి జమున కన్నుమూత

హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో ఆలనాటి మేటి నటులు,నటీమణులు జీవితం నుంచి నిష్కారమిస్తున్నారు.. సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు..1936 ఆగష్టు 30న కర్ణాటక హంపీలో జమున జన్మించారు.. జమున తండ్రి శ్రీనివాసరావు,, తల్లి కౌసల్యాదేవి..సినిమాల్లోకి రాకముందు జమున అసలు పేరు జానాబాయి..హంపిలో జన్మించినా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో అమె బాల్యం గడిచింది..జమున, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ అందరిలో గుర్తింపు తెచ్చుకుంది..అలా నాటకాలు వేస్తున్న సమయంలో హిరోయిన్ సావిత్రి దుగ్గిరాలలో నాటక ప్రదర్శన ఉన్న సమయంలో జమున ఇంటిలోనే బస చేశారు..సావిత్రి, జమునని సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించడంతో సినిమా రంగంపై ఆశలు పెంచుకుంది..తొలి అవకాశం జై వీర బేతాళ అనే సినిమాలో జమునకు అవకాశం వచ్చినా ఆ సినిమా మధ్యలో ఆగిపోవడంతో నిరాశకి గురైంది..వెంటనే గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ సినిమాతో మరో అవకాశం వచ్చింది..ఈ సినిమా అంతగా ఆడకపోయినా జమున క్యారెక్టర్ కి మాత్రం పేరొచ్చింది..ఈ సినిమాలో నటించే సమయానికి జమునకి 14 ఏళ్ళ వయస్సు..ఇక అక్కడుంచి జమునకి వరుసగా అవకాశాలు వచ్చాయి..NTR,ANR, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, హరనాథ్, జగ్గయ్య.. లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు..మిస్సమ్మ సినిమాలో అమాయకత్వం, అల్లరి పాత్రతో మెప్పించింది..ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం సినిమాలో మరోసారి సత్యభామ పాత్ర పోషించి ఆ పాత్రకే వన్నె తెచ్చింది..ఆ సినిమాలో ఎన్టీఆర్ కి ధీటుగా సత్యభామ పాత్రలో నటించింది..

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 190 కి పైగా సినిమాల్లో నటించింది..1965లో జూలూరి రమణారావుతో జమున వివాహం జరిగింది..ప్రస్తుతం బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న జమునకి వంశీ, స్రవంతి ఇద్దరు సంతానం..ప్రస్తుతం జమున కొడుకు వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు..కూతురు ఇక్కడే హైదరాబాద్ లో నివసిస్తుండగా జమున ఆవిడ వద్దే ఉంటుంది..జమున మరణంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

13 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

14 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

15 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

15 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

1 day ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.