అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల అధిక టెంపరేచర్ వద్ద నమోదు అవుతున్నాయి..శనివారం తెలంగాణలో 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు చేరుకుంటుండగా రామగుండంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. నిజామాబాద్ లో 40 డిగ్రీలు, హైదరాబాద్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది..అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో 43 డిగ్రీలు,, కర్నూలు 42, తిరుపతి 41, నెల్లూరు, విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది.. 2016 తర్వాత ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు..ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున,, అవసరమైతేనే బయటకు రావాలని,,వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రెండు రోజులు వడగాలులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు..
ఐఎండి సూచనల ప్రకారం రేపు 179 మండలాల్లో తీవ్రవడగాల్పులు,209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది..ఎల్లుండి 44 మండలాల్లో తీవ్ర,193 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.