పాకిస్థాన్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి,పలు యుద్ద విమానలు అగ్నికి అహుతి
అమరావతి: పాకిస్థాన్ లోని పంజాబ్ పరిధిలో వున్న మియాన్ వాలి ఎయిర్ బేస్ పై శనివారం వేకువజామున ఉగ్రవాదులు దాడి చేశారు.. ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పపడ్డారు.. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) అధికారులు వెల్లడించారు..6 మందితో కూడిన ఉగ్రవాదుల బృందం, భారీ ఆయుధాలతో వేకువజామున పాకిస్థాన్ వైమానిక స్థావరంపై దాడి చేసిందని వెల్లడించింది..పాక్ సైన్యం వెంటనే స్పందించి ఎదురుకాల్పులు జరిపిందని,,ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని, మిగతా వారిని బంధించినట్లుగా పేర్కొంది.. ఉగ్రవాదులు వైమానిక స్థావరంలోకి ప్రవేశించేలోపు తాము దాడిని విఫలం చేశామని పాకిస్థాన్ తెలిపింది..ఈ ఘటనలో చాలా వరకు చిన్న, పెద్ద యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తొంది..ఈ దాడి తమ పనేనని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-జిహాద్ పాకిస్థాన్(TJP) ప్రకటించింది..
పాకిస్థాన్ ఆర్మీ:- ఈ దాడిలో ఎయిర్ బేస్ పై నిలిపి ఉంచిన 3 విమానాలు దెబ్బతిన్నాయని,,ఇంధన బౌజర్ కూడా ధ్వంసమైందని పాక్ సైన్యం వెల్లడించింది.. దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలో తీసుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ చివరి దశలో ఉందని పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) వెల్లడించింది.. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. శుక్రవారం పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు..ఈ దాడిలో 5 మంది మరణించగా ఇందులో 2 పోలీసులు ఉన్నారు.. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలెట్లు, వైమానిక దళ సభ్యులు కూడా మృతిచెందినట్లు కొన్ని వార్తల సంస్థలు తెలియచేస్తున్నాయి..
Terrorists attacked Pakistan Air Force base in Mianwali four terrorists have been eliminated, and a clearance operation is currently in progress.#Pakistan #mianwali pic.twitter.com/kXsc11p9sE
— Hamdan Urdu News (@HamdanWahe57839) November 4, 2023