2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష్యం
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు కుట్ర పన్నుతూన్న ఉగ్రవాదులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు..2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని,, జులై 12వ తేదీన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని,,పాట్నా నగరంలోని నయా తోలా ప్రాంతంలో వున్న అనుమానిత ఉగ్రవాదులైన అథర్ పర్వేజ్,, ఎండీ జలాలుద్దీన్ లను బీహార్ పోలీసులు జూలై 11వ తేదిన అరెస్టు చేశారు.. ప్రధాని మోదీ పర్యటనకు 15 రోజుల ముందు అనుమానిత ఉగ్రవాదులు ఫుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందినట్లు దర్యాప్తులో బయటపడిందని ఫుల్వారీ షరీఫ్ ASP మనీష్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు..జులై 6,7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహించారు..దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు..ఈ దాడిలో, పోలీసులు నేరారోపణ పత్రాలను కనుగొన్నారు..వాటిలో ఒకటి 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ దేశం చేయాలనేది.వారి నుంచి 25 పీఎఫ్ఐ కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంటెలిజెన్స్ బ్యూరోకు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద మాడ్యూల్ పనిచేస్తున్నట్లు సమాచారం అందింది. దింతో ఆప్రమత్తమైన పోలీసులు, కేంద్ర సంస్థల అధికారులు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.. ఎండీ జలాలుద్దీన్ జార్ ఖండ్ పోలీసుశాఖలో పనిచేసిన రిటైర్ట్ అయినట్లు దర్యప్తులో తెలిందని అధికారి పేర్కొన్నారు..ఉగ్రవాద శిక్షణ:-కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని దర్యాప్తులో తేలిందని పోలీసుల తెలిపారు..అరెస్ట్ యిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని వెల్లడించారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.