ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా..
అమరావతి: జ్ఞానవాపి కేసులో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది.. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది..దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది..జ్ఞానవాపి వ్యాసాజీ బేస్ మెంట్ లో పూజలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఇరువర్గాలు వాదనలు అలకించిన కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.. సీల్ చేసిన 10 సెల్లార్లలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.. శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ లు కోర్టులో వాదనలు వినిపించారు..నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడింగ్ను తెరిచేందుకు అనుమతించాలని,,1993కి ముందు తరహాలోనే బేస్మెంట్లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.. దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున ముంతాజ్ అహ్మద్, ఇఖ్లాక్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. బేస్మెంట్ మసీదులో భాగమని,, అక్కడ పూజలు చేయడానికి వీలేదన్నారు..ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇస్తూ, వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది..తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది..ఈ సందర్భంగా హిందూపక్షం న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశం కీలక మలుపు అన్నారు. పూజలకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.