అమరావతి: భారతదేశం కంటే ముందుగా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకునేందుకు ఆగష్టు 11వ తేదిన రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది..చంద్రునికి దగ్గరలో చేరుకున్నప్పటి సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయిందని,, లూనా-25తో కమ్యూనికేషన్స్ అదివారం మధ్యాహ్నం 2.57 గంటలకు పూర్తిగా తెగిపోయాయని,,దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వెల్లడించింది..కొన్ని గంటల ముందు లూనా-25 ల్యాండర్ లో సమస్యలు తలెత్తాయని తెలిపింది..రాకెట్లోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా పేర్కొంది..ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే తమ ప్రయోగం విఫలమైందని ప్రకటించింది.వీలైనంత వరకు లూనా-25 ల్యాండర్ తో కమ్యూనికేషన్స్ కోసం ప్రయత్నిస్తామని వెల్లడించింది..గతంలో చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ ను దృష్టిలో వుంచుకుని,,భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది..ఈ సారి ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఇస్రో అనేక మార్పులు చేసింది.. అదివారం వేకువజామున చంద్రయాన్-3 మధ్య రెండో,,చివరి డీ-బూస్టింగ్ ను విజయవతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటన విడుదల చేసింది..చంద్రుడికి చేరువైన విక్రమ్ ల్యాండర్,, ల్యాండింగ్ కావడమే మిగిలి వుంది..రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలమైన వేళ ప్రపంచం దృష్టి చంద్రయాన్-3 పైనే వుంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.