NATIONAL

పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరు-మెదీ

డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం..

అమరావతి: పాత కళ్లద్దాలతో చూడటం అలవాటుగా ఉన్న వారు అభివృద్దిని సహించరంటూ ప్రతిపక్షాలపై విమర్శలపై ప్రధాని మోదీ మండిపడ్డారు.శనివారం అరుణాచల్ ప్రదేశ్‌ లోని “డోనీ పోలో” (సూర్యుడు-చంద్రుడు) ఎయిర్‌పోర్ట్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. హోలింగిలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో ఈశాన్య రాష్ట్రాల్లో దేశభద్రతతో పాటు టూరిజం రంగం వేగంగా అభివృద్ధి కానుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, విపక్షాలు గతంలో విమానాశ్రయ నిర్మాణంపై చేసిన ఆరోపణలకు పై విధంగా తీవ్రంగా స్పందించారు.ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలో చూసే వాళ్లు,దశాబ్దల నాటి వాళ్లు పాత కళ్లద్దాలు మార్చుకోవాలని ప్రధాని హితవు పలికారు.

2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్ ‌కు శంకుస్థాపన చేశానని, 2019 మేలో ఎన్నికలు ఉండటంతో ప్రతిపక్షాలు,అభివృద్దిని అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని విమర్శలు చేసే వాళ్లు గగ్గోలు చేశారన్నారు.దేశంలో ఏ మూల అభివృద్ది జరుగుతున్న పాత కళ్లద్దాలతో చూడటం అలవాటు ఉన్న విమర్శకులు, కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోదీ ఇక్కడకు వచ్చారని, ఎప్పటికీ విమానాశ్రయ నిర్మాణం జరగదని విమర్శించిన విషయంను ప్రధాని గుర్తు చేశారు. ప్రతీ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే అలవాటు ఉన్న వారికి ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభం కావడం చెంపపెట్టు అని చెప్పారు. పాత కళ్లద్దాలు తొలగించాలని వారికి చెప్పదలచుకున్నానని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో దేశం ప్రగతి పథం వైపు దూసుకెళ్తోందని, ఇప్పటికైనా ప్రతి విషయానికి రాజకీయ రంగు పులమడం మానుకోవాలని విమర్శకులకు హితవు పలికారు.690 ఎకరాల విస్తీర్ణంలో రూ.640 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. గంట‌కు 200 మంది ప్రయాణికులకు సేవాలు అందించే 8 చెక్ ఇన్ కౌంట‌ర్లు నిర్మించారు.2300 మీట‌ర్ల ర‌న్‌వే ఉండే విధంగా నిర్మించడంతో, బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా వుంటుంది.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

15 mins ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

43 mins ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

22 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

24 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.