నెల్లూరు: అర్హులైన టిడ్కో గృహ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులకు సూచించారు. ప్రతీ శనివారం నిర్వహించే ‘హౌసింగ్ డే’ లో భాగంగా స్థానిక వెంకటేశ్వరపురం టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణంలో జరిగిన లబ్ధిదారుల అవగాహన సదస్సులో అధికారులతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్, మార్టగేజ్ పూర్తయిన గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. స్థానిక గృహ సముదాయాలలోని ఒక బ్లాకుకు సంభందించి ఇప్పటివరకు 706 మంది లబ్ధిదారులకు గృహ రుణాలు మంజూరు అయ్యాయని, 365,430 చ.అ వైశాల్యం గల గృహాలకు వారంతా దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. అందులో 454 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి గృహాలను అందజేసామని, 136 మందికి మార్టగేజ్ డీడి పెండింగులో ఉందని వివరించారు. 62 మంది లబ్ధిదారులు గృహాల స్వాధీనం ప్రక్రియకు స్పందించని కారణంగా వారి దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, 69 మంది లబ్ధిదారులు వారి తరపున చెల్లించాల్సిన సాధారణ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు చెల్లించని కారణంగా వారి దరఖాస్తులు కూడా పెండింగులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. విద్యుత్తు, వీధి దీపాలు, సి.సి కెమెరాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గృహాలను కేటాయించనున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడ్కో ఈ.ఈ ఉమా శంకర శాస్త్రి, హౌసింగ్ కార్పొరేషన్ ఈ.ఈ, డి.ఈ, ఏ.ఈలు, మెప్మా విభాగం అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయం వెల్ఫేర్, అమెనిటీస్ కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.