AMARAVATHIDISTRICTS

టిడ్కో గృహ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: అర్హులైన టిడ్కో గృహ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులకు సూచించారు. ప్రతీ శనివారం నిర్వహించే ‘హౌసింగ్ డే’ లో భాగంగా స్థానిక వెంకటేశ్వరపురం టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణంలో జరిగిన లబ్ధిదారుల అవగాహన సదస్సులో అధికారులతో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్, మార్టగేజ్ పూర్తయిన గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. స్థానిక గృహ సముదాయాలలోని ఒక బ్లాకుకు సంభందించి ఇప్పటివరకు 706 మంది లబ్ధిదారులకు గృహ రుణాలు మంజూరు అయ్యాయని, 365,430 చ.అ వైశాల్యం గల గృహాలకు వారంతా దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. అందులో 454 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి గృహాలను అందజేసామని, 136 మందికి మార్టగేజ్ డీడి పెండింగులో ఉందని వివరించారు. 62 మంది లబ్ధిదారులు గృహాల స్వాధీనం ప్రక్రియకు స్పందించని కారణంగా వారి దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, 69 మంది లబ్ధిదారులు వారి తరపున చెల్లించాల్సిన సాధారణ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు చెల్లించని కారణంగా వారి దరఖాస్తులు కూడా పెండింగులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు. విద్యుత్తు, వీధి దీపాలు, సి.సి కెమెరాలు, మంచినీరు, డ్రైన్లు, రోడ్డు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు గృహాలను కేటాయించనున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడ్కో ఈ.ఈ ఉమా శంకర శాస్త్రి, హౌసింగ్ కార్పొరేషన్ ఈ.ఈ, డి.ఈ, ఏ.ఈలు, మెప్మా విభాగం అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయం వెల్ఫేర్, అమెనిటీస్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *