POLITICS

ఎన్నికల హామీలపై కాంగ్రెస్ పార్టీకి  కర్ణాటకలో కష్టాలు ప్రారంభం

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి  కర్ణాటకలో కష్టాలు ప్రారంభంమౌవుతున్నాయి..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు,ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు ప్రారంభానికి సిద్దమౌవుతున్నాయి..నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును వినియోగించేవారు జూన్ 1వ తేది నుంచి విద్యుత్తు బిల్లులను చెల్లించొద్దని బీజేపీ నేత, మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ ప్రజలను కోరారు.. గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తాను మైసూరు-కొడగు ప్రాంతంలో ధర్నా చేస్తానని చెప్పారు..ఒక కుటుంబం నెలకు 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును వాడుకుంటే, అందులో 200 యూనిట్లను ఉచితంగా పరిగణించాలని, మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.. నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తును ఉపయోగించేవారు జూన్ 1 నుంచి బిల్లులు చెల్లించవద్దని చెప్పారు..200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తు సిద్ధరామయ్యకు కూడా ఉచితమేనని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు..

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..224 స్థానాలున్న కర్ణాటక శాసన సభలో 135 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నది..పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని,,డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలనూ త్వరలోనే అమలు చేస్తామని నూతన ప్రభుత్వం ప్రకటించింది.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

4 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.