కొనుగోలు వ్యవహారం పూర్తి..
అమరావతి: ఎదుటి వ్యక్తులతో మాట్లడితే,తనకు ఎంత లాభం అని ఆలోచించే టెస్లా కార్ల సీఈవో ఎలన్ మస్క్, ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తిచేశాడని అమెరికన్ మీడియా వెల్లడించింది. 44 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ ఈ డీల్ పూర్తి చేశాడని పేర్కొంది. ట్విట్టర్ తన సొంతం కాగానే, ఎలన్ మస్క్, ట్విట్టర్ సంస్థలో కీలకంగా ఉన్న కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తొలగించాడు.వీరిలో CEO పరాగ్ అగర్వాల్తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెతోపాటు మరికొందరిని ఉద్యోగంలోంచి తొలగించాడు. వీరిలో కొందరిపై ఎలన్ మస్క్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఫేక్ అకౌంట్లు, కంపెనీకి సంబంధించిన ఇతర అంశాల్లో తనకు తప్పుడు సమాచారం అందించారని మస్క్ ఆరోపించాడు. మరికొందరు ఉద్యోగుల్ని కూడా తొలగించే యోచనలో ఎలన్ మస్క్ వున్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. కంపెనీలో దాదాపు 7,500 మంది ఉద్యోగుల్ని తగ్గించి, కంపెనీలో పలు మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.ట్విట్టర్ తన సొంతమైన సందర్భంగా ఎలన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్లో చీఫ్ ట్విట్టర్ అని రాసుకున్నాడు. తాను డబ్బు సంపాదన కోసం ఈ సంస్థను కొనుక్కోలేదని, మానవత్వాన్ని పెంచేందుకే ట్విట్టర్ కొనుగోలు చేశానని పేర్కొన్నాడు?
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.