అమరావతి: ప్రపంచంలోనే రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) గుర్తింపు పొందింది.. 2021లో భారత్లో UPI లావాదేవీల మొత్తం విలువ 940 బిలియన్ డాలర్లకు చేరుకుంది..UPI ఆధారిత చెల్లింపుల వ్యవస్థ త్వరలో బ్రిటన్లోనూ వాడుకలోకి రాన్నుది..చెల్లింపుల సంస్థ Payxpert సహకారంతో బ్రిటన్లోనూ చెల్లింపులు జరిపేందుకు UPI సేవలు త్వరలో అందుబాటులోకి తెస్తామని యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రూపకర్త, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCL) ఓ ప్రకటన తెలిపింది..ఈ పద్దతి బ్రిటన్లోని భారతీయ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొంది..ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ NPCL,, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ Payxpertతో ఒప్పందం కుదుర్చుకుంది..ఈ ఒప్పందం ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత భారతీయ చెల్లింపుల విధానం,, బ్రిటన్లోనూ అందుబాటులోకి వస్తుంది..బ్రిటన్లో UPI అందుబాటులోకి వస్తే తమకు కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయని Payxpert సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ ఆర్మ్ స్ట్రాంగ్ పేర్కొన్నారు..ఇప్పటికే UPI ద్వారా చెల్లింపుల విధానం భూటాన్,, నేపాల్ లో ప్రారంభం అయ్యాయి..ఇటీవలే ప్రాన్స్ తోను UPI విధానంలో చెల్లింపులు జరిపేందుకు చర్యలు జరుగుతున్నాయి.. త్వరలోనే Rupay card ద్వారా చెల్లింపులు గణనీయంగా పెరుగుతాయని ఆర్దిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.