అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాజంలో ఆశాంతికి కారణం అవుతున్న గుండాలను,రేపిస్టులను వదిలేసి, బాధితులను మాత్రం వేధిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.శనివారం గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేసిన బాధితులను పరామర్శించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరించాలనే పేరుతో కొంతమంది ఇళ్లను కూల్చివేశారని,ఇందుకు ప్రధాన కారణం,మార్చిలో జనసేన అవిర్భవ సభకు స్థలం ఇచ్చినవారిపై కక్ష్య సాధించేందుకు రోడ్డు విస్తరించాలనే కుంటిసాకుతో వైసీపీ నేతలు కక్ష కట్టి వారి ఇళ్లను కూల్చివేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇప్పటం గ్రామం ఏమన్నా కాకినాడా? లేదా రాజమహేంద్రవరంమా? రోడ్లు విస్తరించటానికి అంటూ నిలదీశారు. ఇలా ఇతర పార్టీలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి, పాలన చేతకాకపోవడంతో,ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. గుంతలతో నిండిన రోడ్లకు మరమ్మత్తులు చేయాలేని, ఈ ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసి రోడ్లు విస్తరిస్తుందా? వల్లభాయ్ పటేల్,మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీల విగ్రహాలు కూల్చివేసి,రాజశేఖర్ రెడ్డి విగ్రహాంను మాత్రం వదిలివేయడం చూస్తుంటే,ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా ఆర్దమౌవుతుందన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడే వైసీపీ తమకు అధికారం శాశ్వతం అని అనుకుంటోందని,ప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్దతులను ప్రజలు గమనిస్తున్నరని,,వారు పడుతున్న కష్టాలకు తగిన ప్రతిఫలంగా, వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇళ్లు కూల్చివేయటం వంటి దౌర్జాన్యాలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించిన పవన్ కల్యాణ్..మీరు ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తు ఇళ్లు కూల్చివేస్తుంటే మేం ఇడుపులపాయలో హైవే నిర్మిస్తాం అంటూ హెచ్చరించారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.