నెల్లూరు: నగర వ్యాప్తంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణతో ఆదర్శ నెల్లూరు హరిత నగరాన్ని తీర్చిదిద్దుదామని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి,కమీషనర్ హరిత పేర్కొన్నారు.హరిత నగరాలు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక రూరల్ నియోజకవర్గం బుజ బుజ నెల్లూరు వల్లూరమ్మ కాలనీ ప్రాంతంలో మొక్కలను నాటి సంరక్షణా బాధ్యతలను స్థానికులకు అప్పగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న హరిత నగరాలు’కార్యక్రమాన్ని నగర వ్యాప్తంగా విజయవంతం చేయాలని సూచించారు. పర్యావరణ హితానికై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ ఆచరించేలా చైతన్యం కలిగించాలని కమీషనర్ హరిత కోరారు.నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,అధికారులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.