అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ తెలిపార..మంగళవారం అన్నమయ్య జిల్లా కలికిరి కూటమి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, YSRCPపై నిప్పులు చెరిగారు..పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పని చేసిందని దుయ్యబట్టారు..YSRCP ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందన్నారు.. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని మండిపడ్డారు..ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని మాఫియాలకూ పక్కా ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు..కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని,, అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన రాయలసీమ నేల అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.. చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతం, రాయలసీమ అని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ వికాసం మోదీ లక్ష్యం, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోదీ తెలుగులో చెప్పారు..నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని, కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.. టమాటా నిల్వ చేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు..