AMARAVATHINATIONAL

ప్రమాద వశాత్తు కూలిన మిగ్-21 యుద్ధ విమానం-ముగ్గరు మృతి

అమరావతి: రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ సమీపంలో బహ్లోల్‌నగర్‌లో ఓ ఇంటిపై భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 కూలిపోయింది.సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది..విమానం కూలడానికి ముందే అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి ఎమర్జీన్సీ ప్యారాచూట్ సహాయంతో దూకివేశాడు..దీంతో అతను స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు..విమానం కూలిన ప్రమాదంలో ఇంటి వద్ద వున్నఇద్దరు మహిళలు మృతి చెందగా,,మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి..బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..చికిత్స పొందుతూ వ్యక్తి కూడా మృతి చెందాడు..సూరత్‌గఢ్‌ నుంచి మిగ్-21 యుద్ధ విమానం బయలుదేరి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో పైలట్‌కు గాయాలయ్యాయని, పైలట్ కోసం వైమానిక దళానికి చెందిన MI-17 చాపర్ ద్వారా అతన్ని చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించనున్నది.. మిగ్ 21 యుద్ధ విమానం కూలడంపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది..సూరత్‌గఢ్ సమీపంలో

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *